పత్తి సాగుపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2022-05-22T05:56:44+05:30 IST
సాంకేతిక పరిజ్ఞానంతో పత్తి సా గుపై రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రా వు అధికారులకు సూచించారు.
అదనపు కలెక్టర్ మోహన్రావు
సూర్యాపేట(కలెక్టరేట్), మే 21: సాంకేతిక పరిజ్ఞానంతో పత్తి సా గుపై రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రా వు అధికారులకు సూచించారు. పత్తిసాగు నూతన విధానాలపై కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తేలికపా టి నేలలు గుర్తించి పంటసాగు, పత్తి లో అధునాతన విధానాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తేలికపాటి భూములు ఉన్నాయన్నా రు.సమావేశంలో ఏడీఏలు సంధ్యారాణి, వాసు, జగ్గునాయక్,ఏఈవోలు, ఏవోలు,తదితరులు పాల్గొన్నారు.