దిశ యాప్‌పై అవగాహన పెంచుకోండి

ABN , First Publish Date - 2021-07-26T05:05:52+05:30 IST

దిశ చట్టంపై అవగాహన పెంచుకుంటే అకృత్యాలు అడ్డు కునేందుకు అవకాశముంటుందని శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

దిశ యాప్‌పై అవగాహన పెంచుకోండి
మాట్లాడుతున్న డీఎస్పీ మహేంద్ర


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: దిశ చట్టంపై అవగాహన పెంచుకుంటే అకృత్యాలు అడ్డు కునేందుకు అవకాశముంటుందని శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ఆదివారం శ్రీకా కుళం నగరంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో దిశ చట్టం, దిశయాప్‌పై వార్డు మహిళా పోలీసులు, మహిళామిత్ర, వార్డు వలంటీర్లు, డ్వాక్రా మహిళలతో అవగాహన కల్పించారు.కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ అం బేడ్కర్‌, ఎస్‌ఐ విజయకుమార్‌ పాల్గొన్నారు.  ఫ సీతంపేట : డ్వాక్రా మహిళలకు దిశ చట్టం, కొవిడ్‌ థర్డ్‌వేవ్‌పై అవగాహన కల్పించినట్లు సీతంపేట ఎస్‌ఐ ప్రభావతి తెలిపారు. ఆదివారం సీతంపేట ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో  మహిళా సంఘ సభ్యులకు దిశయాప్‌ వినియోగంపై వివరించారు. 


ఎస్‌ 

Updated Date - 2021-07-26T05:05:52+05:30 IST