రైతు సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2021-10-27T05:15:26+05:30 IST
ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.
బుట్టాయగూడెం, అక్టోబరు 26: ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. దొరమామిడిలో రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 38,660 మందికి రూ.8.73 కోట్ల చెక్కులను ఆయన పంపి ణీ చేశారు. ఏడీ వి.హేమకుమారి, ఎంపీపీ కారం శాంతి, వైస్ ఎంపీసీ కుక్క ల వరలక్ష్మి, జడ్పీటీసీ మొడియం రామతులసి, సర్పంచ్ తెల్లం రాముడు, ఏవో బి.సుమలత, పోలిన సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీలు, నాయకులు అల్లూరి రత్నాజిరావు, ఆరేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఖరీఫ్ పంట రుణాలు, యంత్రసేవా పథకాలను మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంగళవారం ప్రారంభించారు. ఎంపీపీ బొండా డ మోహిని, జడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, ఏడీఏ జయ దేవరాజు, ఎంపీడీవో ఆశీర్వాదం, ఏవో దుర్గా రమేష్ పాల్గొన్నారు.