‌మా జోలికి వస్తే వదిలిపెట్టం: రాజ్‌ థాకరే‌కు మతీన్ షెఖానీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-16T01:48:25+05:30 IST

ముంబై: మే 3 నాటికి మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే హెచ్చరించడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్పందించింది.

‌మా జోలికి వస్తే వదిలిపెట్టం: రాజ్‌ థాకరే‌కు మతీన్ షెఖానీ హెచ్చరిక

ముంబై: మే 3 నాటికి మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే హెచ్చరించడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్పందించింది. తమ మసీదుల జోలికి వస్తే వదిలిపెట్టబోమని పీఎఫ్‌ఐ ముంబ్రా అధ్యక్షుడు మతీన్ షెఖానీ వార్నింగ్ ఇచ్చారు.


మే 3 నాటికి లౌడ్‌స్పీకర్లను ఆపకపోతే, తాము హనుమాన్ చాలీసాను వినిపిస్తామని రాజ్ థాకరే చెప్పారు. ఇది సామాజిక సమస్య అని, మతపరమైన సమస్య కాదని చెప్పారు. 


రాజ్ థాకరే హెచ్చరికలపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముంబ్రా అధ్యక్షుడు మతీన్ షెఖానీ ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరేకు వార్నింగ్ ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. 

Updated Date - 2022-04-16T01:48:25+05:30 IST