పండుగ రోజూ.. దీక్షాదక్షత

ABN , First Publish Date - 2021-01-16T05:34:55+05:30 IST

రాజధాని రైతులు పండుగ రోజూ శిబిరాల్లో ఆందో ళనలు కొనసాగించారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధా నిగా కొనసాగాలని చేపట్టిన ఉద్యమం శుక్రవారం 395 వ రోజుకు చేరుకుంది.

పండుగ రోజూ.. దీక్షాదక్షత
ఉద్దండ్రాయునిపాలెంలో అమరావతి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, మహిళలు

శిబిరాల్లోనే సంక్రాంతి, కనుమ..

ముగ్గులతో మహిళల నిరసన

395వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, జనవరి 15: రాజధాని రైతులు పండుగ రోజూ శిబిరాల్లో ఆందో ళనలు కొనసాగించారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధా నిగా కొనసాగాలని  చేపట్టిన ఉద్యమం శుక్రవారం 395 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ  పండుగ  పర్వదినాలను రోడ్లమీదే జరుపు కోవలసిన దుస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశా రు. చట్టప్రకారం ఒప్పందం చేసుకొని  భూములి చ్చా మని వారు తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని అభి వృద్ధి చేయలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని  దీక్ష చేయటం సిగ్గుచేటన్నారు.  మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోత డక, పొన్నెకల్లు గ్రామాల్లో రైతులు, మహిళ లు నిరసనలు కొనసాగించారు. మోత డక గ్రామంలో దీక్షా శిబిరం వద్ద సంక్రాంతి ముగ్గుల్లో రాష్ట్ర చిత్రపటాన్ని వేసి నిరసన లు వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో ఆందోళనలు కొనసా గాయి. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల నిరసన దీక్షల్లో ఐకాస నేతలు స్థానిక రైతు లు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:34:55+05:30 IST