ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి

ABN , First Publish Date - 2021-11-29T05:24:55+05:30 IST

ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి అని రాజధాని రైతులు తెలిపారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి
తాడికొండ శిబిరంలో మహిళలు, రైతుల నినాదాలు

712వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, నవంబరు 28: ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి అని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 712 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని అమరావతితో పాటు ప్రతీ అభివృద్ధి కార్యక్రమాన్ని నిలువునా ఆపేశారని పాలకులపై మండిపడ్డారు. పోలవరం ప్రగతి, ప్రత్యేక హోదా ఊసే మరిచారన్నారు. రాష్ట్ర నడి బొడ్డులో, అందరికీ అందుబాటులో, అన్ని వనరులతో అందుబాటులో ఉండే అమరావతిని నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్ర విజయవంతగా సాగుతుందన్నారు. ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  


====================================================

Updated Date - 2021-11-29T05:24:55+05:30 IST