పాదయాత్రకు జన నీరాజనం

ABN , First Publish Date - 2021-12-06T05:34:09+05:30 IST

న్యాయస్తానం టు దేవస్తానం అమరావతి మహా పాదయాత్రకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారని రాజధాని రైతులు తెలిపారు.

పాదయాత్రకు జన నీరాజనం
తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

719వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, డిసెంబరు 5: న్యాయస్తానం టు దేవస్తానం అమరావతి మహా పాదయాత్రకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 719వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ,     సీఎం జగన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఏ ప్రాంతం వారు ఆనందంగా లేరన్నారు. అమరావతిని రక్షించుకోవడానికి ఐదు కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.   భూములు ఇచ్చిన రైతులను అవమానించడమే కాకుండా,  అమరావతిని నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రగతిని పాలకులు తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజఽధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.  


Updated Date - 2021-12-06T05:34:09+05:30 IST