TS News: కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-25T20:55:36+05:30 IST

సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

TS News: కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: రాజగోపాల్‌రెడ్డి

యాదాద్రి (Yadadri): టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 23వేల మంది వీఆర్ఏ (VRA)లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మే (Strike) చేస్తుంటే.. ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్లతో ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వేదికలు నిరుపయోగంగా మారాయన్నారు. తెలంగాణలో మలి ఉద్యమం రాబోతోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-25T20:55:36+05:30 IST