TS News: మునుగోడు ప్రజలను ఒప్పించడం వారి తరం కాదు: రాజగోపాల్ రెడ్డి
ABN , First Publish Date - 2022-09-05T18:45:07+05:30 IST
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉపఎన్నిక జరగబోతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
యాదాద్రి (Yadadri): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు (Munugodu) ఉపఎన్నిక (By Election) జరగబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. సోమవారం చౌటుప్పల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లు ఫామ్ హౌస్ నుంచి రాని సీఎం కేసీఆర్ (CM KCR).. మునుగోడు ఉప ఎన్నిక దెబ్బతో అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారని అన్నారు. మూడో విడత గొర్రెల పంపిణీ మునుగోడులో మాత్రమే పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రి జగదీష్ రెడ్డి తిరిగినా మునుగోడు ప్రజలను ఒప్పించడం వారి తరం కాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ సమస్య గురించి మూడుసార్లు సీఎం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఇంకా 100 స్కీములు పెట్టిన ప్రజలు కేసీఆర్ను నమ్మరన్నారు. మునుగోడు ప్రజల తీర్పుతోనే కేసీఆర్ పతనం ఖాయమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.