21న నాతో పాటు చాలా మంది బీజేపీలో చేరుతారు: Rajagopal Reddy

ABN , First Publish Date - 2022-08-06T19:36:48+05:30 IST

21న తనతో పాటు చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వారందరూ బీజేపీ(BJP)లో చేరుతారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) తెలిపారు.

21న నాతో పాటు చాలా మంది బీజేపీలో చేరుతారు: Rajagopal Reddy

Delhi : 21న తనతో పాటు చాలా మంది ఉద్యమ నేపథ్యం ఉన్న వారందరూ బీజేపీ(BJP)లో చేరుతారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్ముడు పోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. నిరూపిస్తావా? అని ప్రశ్నించారు. 13 ఏళ్లలో ఒక్క కేసు కూడా తనపై లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy)పై 120 కేసులు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పెట్టారా? అని రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి భాష సరిగా లేదు. నేను వెంకట్ రెడ్డి(Venkat Reddy) కలిసే ఉన్నాం. తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసే ఉన్నారనే కదా అందరూ అభిమానించేది. కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి లేదన్నారు. నా రాజీనామా నాకోసం కాదు.. తెలంగాణ, మునుగోడు ప్రజల కోసం. స్పీకర్‌ని 8వ తేదీన కలుస్తాను. రాజీనామా ఆమోదం తెలుసుకుంటాను. రేవంత్ రెడ్డి భాషను మునుగోడు ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీఎం సీఎం అని రేవంత్ రెడ్డిని అంటున్నారు. సీఎం అంటే చంద్రబాబు ముద్దు బిడ్డ’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-06T19:36:48+05:30 IST