రాజమండ్రిలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-07T02:07:54+05:30 IST

కరోనా వైరస్‌ అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోంది. జనాలను పట్టిపీడిస్తోంది. రాజమండ్రి అర్బన్‌లో సోమవారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాజమండ్రిలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

రాజమండ్రి: కరోనా వైరస్‌ అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోంది. జనాలను పట్టిపీడిస్తోంది. రాజమండ్రి అర్బన్‌లో సోమవారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 239 మందికి కరోనా సోకింది. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. రాజమండ్రి అర్బన్‌లో 54  కట్టడి ప్రాంతాలను అధికారులు ప్రకటించారు. దీంతో పాటుగా రాజమండ్రి రూరల్‌లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు కొత్తగా ఐదు కరోనా కేసులను గుర్తించారు. రూరల్‌లో ఇప్పటివరకు 147 మందికి కరోనా సోకింది. ఐదుగురు మృతి చెందారు. రూరల్‌లో 51 కట్టడి ప్రాంతాలను అధికారులు ప్రకటించారు. అలాగే పి. గన్నవరం మండలం ముంగండ గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

Updated Date - 2020-07-07T02:07:54+05:30 IST