Rajahmundryలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్

ABN , First Publish Date - 2021-12-16T17:03:17+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది

Rajahmundryలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అపహరణకు గురైంది. ఐదు లక్షలు ఇస్తే వదిలేస్తానని.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ యువతి తండ్రికి కిడ్నాపర్ ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-16T17:03:17+05:30 IST