అక్రమ కేసులు ఎత్తి వేయాలి.. లేదంటే: హర్షకుమార్
ABN , First Publish Date - 2022-07-10T02:07:02+05:30 IST
దళితుల భిక్షతోనే వైసీపీ ప్లీనరీ (Ycp Plenary) సమావేశాలు జరిగాయని మాజీ ఎంపీ హర్షకుమార్ (Ex Mp Harshakumar) అన్నారు. చెల్లిని, తల్లిని..
రాజమండ్రి (Rajahmundry): దళితుల భిక్షతోనే వైసీపీ ప్లీనరీ (Ycp Plenary) సమావేశాలు జరిగాయని మాజీ ఎంపీ హర్షకుమార్ (Ex Mp Harshakumar) అన్నారు. చెల్లిని, తల్లిని తరిమేసినట్టే ఏపీ (Ap)లో దళితులను తరిమేస్తున్నారన్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ (Cm Jagan) పాలనలో దళితులను రెండో శ్రేణి ప్రజలుగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. రావులపాలెం ఎస్ఐ, సీఐని తక్షణమే సస్పెన్షన్ చేయాలన్నారు. ఈ నెల 12లోపు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 13న ఛలో రావులపాలెం (Challo Ravulapalem)కు పిలుపునిస్తామని హర్షకుమార్ హెచ్చరించారు.