కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరించాలి
ABN , First Publish Date - 2021-07-27T05:24:12+05:30 IST
రజక విద్యాసేవాపరిషత్, కమ్యూనిటీహాల్ పేరిట బుడంపాడు వద్ద నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని సందర్శించి, ప్రభుత్వపరంగా నిధులు విడుదల చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరితకు రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘ సభ్యులు సోమవారం వినతిపత్రం అందజేశారు.
హోంమంత్రికి రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న వినతి
గుంటూరు (తూర్పు), జూలై 26: రజక విద్యాసేవాపరిషత్, కమ్యూనిటీహాల్ పేరిట బుడంపాడు వద్ద నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని సందర్శించి, ప్రభుత్వపరంగా నిధులు విడుదల చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరితకు రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘ సభ్యులు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రంగన్న మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను హోంమంత్రి స్వయంగా సందర్శించి తన వంతు సహకారం అందిస్తానని హమీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో రజక విద్యాసేవాపరిషత్, కమ్యూనిటీహాల్ కోశాధికారి వీర్లపాటి మురళి, ప్రధాన కార్యదర్శి జమ్ముల లక్ష్మీప్రసాదు, సభ్యులు మోతె సాయిబాబు, పులివెందుల కాశీ, పాత గుంటూరు మురళి తదితరులు పాల్గొన్నారు.