రాజంపేట పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శి మృతి
ABN , First Publish Date - 2021-10-18T05:50:44+05:30 IST
రామాపురం మండలం చిట్లూరుకు చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రబోలు శేఖర్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
రామాపురం, అక్టోబరు 17: రామాపురం మండలం చిట్లూరుకు చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రబోలు శేఖర్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ జయరాములు వివరించారు.