డీల్ మాట్లాడుకుందాం రా అని ఓ మహిళ పిలిస్తే వెళ్లాడు.. గదిలోకి వెళ్లాకా బ్యాంకు మేనేజర్‌కు ఎదురైన ఊహించని పరిణామం!

ABN , First Publish Date - 2021-10-09T17:01:48+05:30 IST

బ్యాంకింగ్ రంగంలో..

డీల్ మాట్లాడుకుందాం రా అని ఓ మహిళ పిలిస్తే వెళ్లాడు.. గదిలోకి వెళ్లాకా బ్యాంకు మేనేజర్‌కు ఎదురైన ఊహించని పరిణామం!

ఇంటర్‌నెట్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను.. డీల్ మాట్లాడుకుందాం.. చెప్పిన అడ్రస్‌కు రండి అని పిలిచింది. సరేనని ఆ గదికి వెళ్లాకా బ్యాంకు మేనేజర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ మహిళ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


ఢిల్లీకి చెందిన సీమా శర్మ అలియాస్ స్వప్న కొన్ని రోజుల క్రితం భరత్‌పూర్‌కు వచ్చింది. అదే ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్‌తో పరిచయం పెంచుకుని అతడి ఫోన్ నెంబర్ ఇప్పించుకుంది. ఓ రోజు ఫోన్ చేసి.. బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానని, డీల్ కోసం తాను చెప్పిన అడ్రస్‌కు రమ్మని చెప్పింది. ఆమె చెప్పిన గదికి వెళ్లాకా అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. అతడిపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.



‘‘మీరంటే నాకిష్టం.. మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను’’అని చెప్పడంతో.. అతను కూడా ఓకే అన్నాడు. కొన్ని రోజుల తర్వాత గానీ అతడికి అసలు విషయం బోధపడలేదు. గదిలో జరిగిందంతా ఆమె వీడియో తీసింది. ఆ వీడియోను అతడికి పంపి బెదిరించింది. రూ.2లక్షలు ఇవ్వాలని.. లేకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. ఆమె ఇచ్చిన షాక్‌కు అతడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. మొదటగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి.. మిగతాది తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆమె నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిగిలిన డబ్బులు ఇస్తాను.. బయట కలవమన్నాడు. ఆమె రాకముందే.. అతడు చెప్పిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ఆమె వచ్చాకా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్‌పాల్ లంబా మాట్లాడుతూ నిందితురాలికి ఇంతకుముందే ఢిల్లీ, అల్వార్‌లలో హనీట్రాప్ కింద కేసులు నమోదయ్యాయన్నారు. బాధితుడు రాజాపార్క్‌ దగ్గర్లోని హనుమాన్ ఢాబాకు సీమాను రప్పించాడని, ఆ తర్వాత అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.


Updated Date - 2021-10-09T17:01:48+05:30 IST