బాలికపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష...నేరం జరిగిన 30 రోజుల్లోనే కోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-10-23T16:38:17+05:30 IST

ఓ చిన్నారి హత్యాచారం కేసులో దోషికి రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది...

బాలికపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష...నేరం జరిగిన 30 రోజుల్లోనే కోర్టు సంచలన తీర్పు

జైపూర్ (రాజస్థాన్): ఓ చిన్నారి హత్యాచారం కేసులో దోషికి రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనలో దోషికి సంఘటన జరిగిన 30 రోజులకే కోర్టు మరణశిక్ష విధించింది.సెప్టెంబరు 20వతేదీన పడుకలన్ పోలీసుస్టేషను పరిధిలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ కేసులో దోషి అయిన దినేష్ జాట్ ఏడేళ్ల బాలికను వ్యవసాయ పొలానికి తీసుకువచ్చి అత్యాచారం జరిపి హతమార్చాడు. బాలిక మృతదేహాన్ని పొదల వెనుక పడేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు దినేష్ ను అరెస్టు చేయగా పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కేవలం ఆరు రోజుల్లోనే చార్జి షీట్ దాఖలు చేశారు. దోషి అయిన దినేష్ జాట్ కు మెర్టా ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. 


Updated Date - 2021-10-23T16:38:17+05:30 IST