దారుణం.. నా కుమారుడినే కొడతావా అంటూ కన్నతండ్రినే పొట్టనపెట్టుకున్నాడు..!

ABN , First Publish Date - 2021-07-14T02:04:28+05:30 IST

అల్లరి చేస్తున్న మనవడి చెంప ఛెళ్లుమనిపించిన ఓ వ్యక్తి తన కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నా కుమారిడిపై చేయిచేసుకుంటావా అంటూ నిందితుడు తన తండ్రిని కర్రతో చావబాదాడు.

దారుణం.. నా కుమారుడినే కొడతావా అంటూ కన్నతండ్రినే పొట్టనపెట్టుకున్నాడు..!

జైపూర్: అల్లరి చేస్తున్న మనవడి చెంప ఛెళ్లుమనిపించిన ఓ వ్యక్తి తన కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నా కుమారిడిపై చేయిచేసుకుంటావా అంటూ నిందితుడు తన తండ్రిని కర్రతో చావబాదాడు. ఆ దెబ్బలకు సొమ్మసిల్లిపోయిన తండ్రి కొద్ది సేపటికే ప్రాణాలు విడిచాడు. రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. వేస్తా అనే వ్యక్తి శనివారం నాడు తన మనవడి(8) అల్లరి భరించలేక అతడి చెంప ఛెళ్లుమనిపించాడు. అయితే.. ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్న తండ్రి జయంతీలాల్‌తో బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో..మనవడిని ఎందుకు కొట్టావంటూ జయంతీలాల్ తన తండ్రి వెస్తాతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం అదుపు తప్పడంతో నిందితుడు తన తండ్రిని కర్రతో కొట్టాడు. దీంతో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. తెల్లవారాకా తండ్రిని ఆస్పత్రికి తీసుకెళదామని జయంతీలాల్ అనుకున్నాడు. కానీ.. ఓ రాత్రి వేళ వెస్తా ప్రాణాలు విడిచాడు. కాగా.. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-07-14T02:04:28+05:30 IST