Rajya Sabha ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యే శోభారాణిపై బీజేపీ సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2022-06-11T13:32:34+05:30 IST

రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా సస్పెన్షన్‌కు గురయ్యారు...

Rajya Sabha ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యే శోభారాణిపై బీజేపీ సస్పెన్షన్ వేటు

జైపూర్ :రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహా సస్పెన్షన్‌కు గురయ్యారు.రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు.శోభారాణి కుష్వాహాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఆమెకు 7 రోజుల సమయం ఇచ్చారు. శోభారాణి విప్‌కు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేసిందో స్పష్టం చేయాల్సిన సమయం వచ్చిందని బీజేపీ ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా వ్యాఖ్యానించారు.క్రాస్ ఓటింగ్ విషయం పార్టీ హైకమాండ్‌కు చేరిందని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనా తెలిపారు.కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ప్రమోద్ తివారీ, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా రాజస్థాన్ నుంచి విజయం సాధించారు.


Updated Date - 2022-06-11T13:32:34+05:30 IST