నళిని పెరోల్ నాలుగోసారి పొడిగింపు
ABN , First Publish Date - 2022-04-28T13:43:33+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో అరెస్టయిన నళిని పెరోల్ నాలుగోసారి పొడిగించారు. వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష విధింపడి 26 ఏళ్లకు పైగా
పెరంబూర్(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో అరెస్టయిన నళిని పెరోల్ నాలుగోసారి పొడిగించారు. వేలూరు మహిళా జైలులో యావజ్జీవశిక్ష విధింపడి 26 ఏళ్లకు పైగా జైలులో ఉన్న ఆమె, తల్లి అనారోగ్యం కారణంగా చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 27న నెలరోజుల పెరోల్ మంజూరు చేసింది. అనంతరం మూడుసార్లు నెల రోజులు పెరోల్ పొడిగించగా, ఈ గడువు బుధవారంతో ముగియగా, నాలుగో సారి మరో నెలరోజులు పెరోల్ పొడిగించారు. ప్రస్తుతం ఆమె వేలూరు జిల్లా కాట్పాడి సమీపం బ్రహ్మపురం ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంటూ, ప్రతిరోజు కాట్పాడి పోలీస్ స్టేషన్లో సంతకం చేస్తున్నారు.