రాజీవ్పార్క్ను పది రోజుల్లో అందుబాటులోకి తేవాలి
ABN , First Publish Date - 2022-06-28T04:29:47+05:30 IST
స్థానిక రాజీవ్ పార్క్ను పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
అధికారులకు ఆదేశించిన కమిషనర్
కడప(ఎర్రముక్కపల్లి), జూన 27: స్థానిక రాజీవ్ పార్క్ను పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కడ ప నగరం స్పందన హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపు పరిష్కరించాలని సూచించారు. కడప నగరంలో వీఎల్టీ, ప్రాపర్టీ టాక్స్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించే బాధ్యత అడ్మినలకు అప్పగించారు. 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అలాగే గోశాల ఏర్పాటుకు నగర శివారు ప్రాంతంలో స్థల పరిశీలన చేయాలని సిటీ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. చెత్త సేకరణలో ఎటువంటి జాప్యం లేకుండా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన అన్ని విభాగాల అధిపతులు అధికారులు పాల్గొన్నారు.