లతా మంగేష్కర్‌కు రాజ్యసభ ఘన నివాళి

ABN , First Publish Date - 2022-02-07T16:45:57+05:30 IST

సంగీత ప్రపంచాన్ని తన గాన మాధుర్యంతో ఓలలాడించి తుదిశ్వాస విడిచిన భారతరత్న లతా మంగేష్కర్‌కు..

లతా మంగేష్కర్‌కు రాజ్యసభ ఘన నివాళి

న్యూఢిల్లీ: సంగీత ప్రపంచాన్ని తన గాన మాధుర్యంతో ఓలలాడించి తుదిశ్వాస విడిచిన భారతరత్న లతా మంగేష్కర్‌కు రాజ్యసభ ఘనంగా నివాళులర్పించింది. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభ మాజీ సభ్యురాలైన లతా మంగేష్కర్ కన్నుమూయడంతో దేశం ఒక లెజిండ్రీ సింగర్‌ను, మానవతావాదిని, సంగీత, సినీ సామ్రాజ్ఞిని కోల్పోయిందని అన్నారు. లత మరణంతో ఒక సంగీత శకం ముగిసిందని, ప్రపంచ సంగీతానికి ఆమె మృతి తీరనిలోటని అన్నారు. లతాజీ సంస్మరణార్ధం సభ్యులంతా సభలో ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభను గంటసేపు చైర్మన్ వాయిదా వేశారు. 

Updated Date - 2022-02-07T16:45:57+05:30 IST