డీఎంహెచ్వోగా బాఽధ్యతలు స్వీకరించిన రాజ్యలక్ష్మి
ABN , First Publish Date - 2022-05-26T07:36:45+05:30 IST
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఒంగోలు(కలెక్టరేట్), మే 25 : జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, కార్యాలయ సిబ్బంది, యూనియన్ నాయకులు కలిసి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి శాఖ ప్రతిష్టను పెంపొందించాలని ఆమె కోరారు. డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ మాధవీలత, డాక్టర్ సుధారాణి, డాక్టర్ పాపారావు, సుందర్ప్రసాద్తోపాటు సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వీవీకృష్ణారావు, కార్యదర్శి ఎన్వీ కృష్ణారెడ్డి, టి.పద్మ, బినిర్మల తదితరులు డీఎంహెచ్వోను సత్కరించారు.