ఐదుగురు రాజ్యసభ సభ్యుల ప్రమాణం
ABN , First Publish Date - 2022-07-19T13:51:52+05:30 IST
రాజ్యసభకు రాష్ట్రం నుంచి కొత్తగా ఎంపికైన ఐదుగురు సభ్యులు సోమవారం పదవీప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై
పెరంబూర్(చెన్నై), జూలై 18: రాజ్యసభకు రాష్ట్రం నుంచి కొత్తగా ఎంపికైన ఐదుగురు సభ్యులు సోమవారం పదవీప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ వరకు జరుగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు, కొత్తగా ఎంపికైన ఎంపీలు పదవీప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి ఎంపికైన కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, డీఎంకేకు చెందిన కేఆర్ఎన్ రాజేష్ కుమార్, ఆర్.గిరిరాజన్, ఎస్.కల్యాణసుందరం, అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం ప్రమాణస్వీకారం చేశారు. వీరందరి చేత రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. వీరందరూ తమిళంలో పదవీప్రమాణం చేయడం విశేషం.