Rakesh అంతిమ యాత్ర ఉద్రిక్తం.. BSNL కార్యాలయంపై దాడి
ABN , First Publish Date - 2022-06-18T17:35:10+05:30 IST
రాకేశ్(Rakesh) అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. దారిలో బీఎస్ఎన్ఎల్(BSNL) కార్యాలయం కనిపించడంతో ఆందోళనకారులు దాడి చేశారు.
వరంగల్ : రాకేశ్(Rakesh) అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. దారిలో బీఎస్ఎన్ఎల్(BSNL) కార్యాలయం కనిపించడంతో ఆందోళనకారులు దాడి చేశారు. పోచం మైదాన్(Pocham Maidan) కూడలిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. పోచం మైదాన్ కూడలి మీదుగా రాకేశ్ అంతిమ యాత్ర సాగుతోంది.
కాగా... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళనలో మృతి చెందిన ఆర్మీ అభ్యర్థి రాకేష్ మృతదేహం ఉదయం వరంగల్ ఎంజీఎంకు చేరుకుంది. ఎంజీఎం మార్చురీలో మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, వామపక్షపార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖానాపూర్ మండలంలో దబీర్ పేట గ్రామంలో రాకేశ్ అంత్యక్రియలు పూర్తవుతాయి.