కేసీఆర్తో ముగిసిన రాకేష్ తికాయత్ భేటీ
ABN , First Publish Date - 2022-03-03T23:34:22+05:30 IST
సీఎం కేసీఆర్తో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్
ఢిల్లీ: సీఎం కేసీఆర్తో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ భేటీ ముగిసింది. తికాయత్తో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తికాయత్ తెలిపారు. తాను నాన్ పాలిటిక్స్కి సంబంధించిన వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. దేశంలో ఒకే వ్యవసాయ పాలసీ ఉంటే బాగుంటుందని తికాయత్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఆందోళనల్లో మృతిచెందిన రైతు కుటుంబాల వివరాలను మార్చి 10లోగా సీఎం కేసీఆర్కి అందిస్తామని తికాయత్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఎకరాకు పదివేలు ఇచ్చే రైతుబంధు పథకం బాగుందన్నారు. వచ్చే ఏడాది హైదరాబాదులో కిసాన్ సమ్మె ఏర్పాటు చేస్తున్నామని తికాయత్ ప్రకటించారు.