ఏపీ యువజన కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా రక్షా రామయ్య

ABN , First Publish Date - 2022-07-01T08:50:10+05:30 IST

ఏపీ యువజన కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా రక్షా రామయ్య

ఏపీ యువజన కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా రక్షా రామయ్య

బెంగళూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ రక్షా రామయ్య ఆంధ్రప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పాటుపడతానని రక్షా రామయ్య బెంగళూరులో గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివా్‌సకు, ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవారుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2022-07-01T08:50:10+05:30 IST