జిల్లా కేంద్రంలో బీజేపీ రక్షాబంధన్
ABN , First Publish Date - 2022-08-09T05:40:39+05:30 IST
రాఖీపౌర్ణమి పురస్కరించుకొని బీజేపీ మహిళ లు సోమవారం ముందస్తు రాఖీలు కట్టి వేడుకలు జరుపుకున్నారు.
కలెక్టర్కు రాఖీ కట్టిన మహిళలు
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 8 : రాఖీపౌర్ణమి పురస్కరించుకొని బీజేపీ మహిళ లు సోమవారం ముందస్తు రాఖీలు కట్టి వేడుకలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, డీఎస్పీ జీవన్రెడ్డిలకు మహిళలు రక్షాబంధన్ గావించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పి. రమాదేవి, నిర్మల్ మహిళా ఇన్చార్జి అలివేలు, నాయకులు మెడిసెమ్మె రాజు, మల్లి కార్జున్రెడ్డి, సామ రాజేశ్వర్రెడ్డి, విలాస్, సాగర్, ఒడిసెల అర్జున్ పాల్గొ న్నారు.