జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-13T04:43:26+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 200 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో మండలంలోని మహమ్మదాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేశారు.

జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

పొదలకూరు, ఆగస్టు 12 : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 200 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో మండలంలోని మహమ్మదాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ  చేశారు.  పీడీ విజయవిశ్వేశ్వరన్‌ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గ్రామంలోని పలు వీధుల్లో ర్యాలీ  చేసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు ఎం.శ్రీహరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

  స్థానిక సేవా భారతి కన్వీనర్‌ గంగవరపు వేణుగోపాల్‌రెడ్డి పొదలకూరు పంచాయతీ బస్టాండు ఆవరణలో శుక్రవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు.  జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  సేవా భారతి సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం, లక్కాకుల ఆనందరావు, జయమూర్తిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T04:43:26+05:30 IST