త్రివర్ణ పతాకంతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-08T05:08:04+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో వీరుల త్యాగాలు ప్రపంచానికి చాటాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.

త్రివర్ణ పతాకంతో ర్యాలీ
ఆకివీడులో వంద మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

ఆకివీడు, ఆగస్టు 7: స్వాతంత్య్ర ఉద్యమంలో వీరుల త్యాగాలు ప్రపంచానికి చాటాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఎంపీడీవో కార్యాలయం నుంచి గాంధీజీ సెంటర్‌ వరకూ 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతం త్య్ర యోధుల స్ఫూర్తిని, నాయకులను స్మరించుకోవాలన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటే అనే భావనతో దేశ నాయకులు, పోరాట యోధులు ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించారన్నారు. పీవీఎల్‌ నర్శింహరాజు, నగర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి, వైస్‌ చైర్మన్‌ పుప్పాల పండు, జోత్స్న, కమిషనర్‌ చోడగం వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ యండగండి శ్రీను, ఎంపీపీ కఠారి జయలక్ష్మి, తహసీల్దార్‌ నీ లాపు గురుమూర్తిరెడ్డి, ఎంపీడీవో శ్రీకర్‌, ఎంఈవో రవీంద్ర, ఎండీ మస్తాన్‌వలీ, మోటుపల్లి గంగాధరరావు, హుస్సేన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-08T05:08:04+05:30 IST