రామ్ చరణ్ ర్యాలీలో పాల్గొన్న అభిమానులకు షాక్..
ABN , First Publish Date - 2022-04-27T17:16:28+05:30 IST
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సినీ నటుడు రామ్ చరణ్ ర్యాలీగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరాడు.
విజయవాడ : గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సినీ నటుడు రామ్ చరణ్ ర్యాలీగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరాడు. ర్యాలీలో పేపర్ పూలతో రామ్ చరణ్కు మెగా అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ ర్యాలీగా బయలుదేరిన మెగా అభిమానులకు షాక్ తగిలింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అభిమానులు అదుపుతప్పి ఎయిర్ పోర్ట్ రోడ్డుపై కిందపడిపోయారు. బైక్లకు తాళాలు వేసి మరీ రామ్ చరణ్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు.