స్వర్ణకవచంలో భద్రాద్రి రామయ్య
ABN , First Publish Date - 2022-06-25T04:41:31+05:30 IST
భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి మూలవరులను శుక్రవారం స్వర్ణ కవచంలో భక్తులు దర్శించి తరించారు.
తిలకించి తరించిన భక్తజనం
భద్రాచలం, జూన్ 24: భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి మూలవరులను శుక్రవారం స్వర్ణ కవచంలో భక్తులు దర్శించి తరించారు. సాయంత్రం స్వామి వారికి సంధ్య హారతి కార్యక్రమాన్ని భక్తిప్రప త్తులతో నిర్వహిం చారు. భద్రాద్రి రామయ్యను రాష్ట్ర సమాచార కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్ దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయంగా స్వాగ తం పలుకుగా అలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ శ్రీని వాస్ యాదవ్, ఆర్ఐ నరసింహారావు, దేవస్థానం పర్య వేక్షకులు సాయి బాబా, వేద పండితులు చిట్టి హనుమత్ శాస్ర్తి పాల్గొన్నారు. రామయ్యను ఏపీజీవీబీ రాష్ట్ర చైర్మన్ కొంటురి కిరణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా పర్యవేక్ష కులు రాకేష్ రెడ్డి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఏపీలోని అనంతపురం జి ల్లా కొవ్వూరునగర్కు చెందిన దొడలురు పెద్దక్క భద్రాద్రి రామయ్య ఉచిత అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళంగా అందజేశారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల శిక్ష ణను నిరుద్యోగ గిరిజన యువత సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ శంకర్నాయక్ కోరారు. భద్రాచలం ఐటీడీఏ పీఎంఆర్సీ భవనంలో శిక్షణా శిబిరా న్ని శుక్రవారం సందర్శించి యువతకు పలు సూచనలు చేశారు. ఐదేళ్లుగా ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపే తమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని తెలిపా రు. కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఏపీవో డేవిడ్రాజ్, ఏసీఎంవో రమణయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.