భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసార్చన
ABN , First Publish Date - 2022-06-26T05:26:17+05:30 IST
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా సువర్ణ తులసార్చన నిర్వహించారు. ఈ సేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భద్రాచలం,జూన్ 25: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా సువర్ణ తులసార్చన నిర్వహించారు. ఈ సేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే స్వామి వారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణ ప్రక్రియలో బాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహా వచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, యోక్త్రబంధనం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధా రణ, బ్రహ్మముడి, తలంబ్రాలు, వేద ఆశీర్వచనం నిర్వహించారు. స్వామి వారిని ఏపీలోని అనం తపురం ఎంపీ రంగయ్య దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయనకు ఆలయ మర్యాదలతోస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందన బాయన ప్రణీత రూ.లక్ష విరాళం అందజేశారు. ఏపీలోని కాకినాడకు చెందిన నెల్లం పద్మావతి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. అనంతరం వారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.