ఘనంగా రామయ్యకు పట్టాభిషేకం

ABN , First Publish Date - 2022-07-02T06:45:35+05:30 IST

పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రామయ్యకు పట్టాభిషేకం
స్వామి వారికి సంధ్యాహారతి సమర్పిస్తున్న దృశ్యం

భద్రాచలం, జూలై 1: పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా నిత్యకల్యానాన్ని స్వామి వారికి నిర్వహించగా ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణదారణ, యోక్తధారణ, శుభముహుర్తం, మాంగ ల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన పూ జ, పుణ్యహావచనం, కంకణధారణ, నదీ జలాల ఆవాహన, హోమం, పట్టాభిషేక పారాయణఘట్టం, ప్రోక్షణ కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. సాయంత్రం సంఽఽధ్యాహారతి కార్యక్రమా న్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయాణాచా ర్యులు, ముఖ్య అర్చకులు అమరవాది మధుసూదనాచార్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T06:45:35+05:30 IST