సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. కొనసాగుతున్న రిస్క్యూ ఆపరేషన్

ABN , First Publish Date - 2022-03-08T17:07:24+05:30 IST

సింగరేణి గనిలో పైకప్పు కూలిన ఘటనలో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. కొనసాగుతున్న రిస్క్యూ ఆపరేషన్

పెద్దపల్లి జిల్లా: సింగరేణి గనిలో పైకప్పు కూలిన ఘటనలో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రామగుండం రీజియన్ ఆర్జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బోల్టు ఫిటింగ్ విధులకు వెళ్లిన అధికారులు, కార్మికులపై గని పైకప్పు కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏడుగురు పనిచేస్తుండగా ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. 


పైకప్పు కూలిన సమయంలో ఎస్‌బీఎల్ యంత్రం క్యాబిన్‌లో ఉండగా యంత్రం బయట ఉన్న వీరయ్య స్వల్ప గాయాలతో వెలుపలకు వచ్చారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందం తక్షణమే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నిన్న ఆర్జీ-3లో కార్మికులపై పైకప్పు కూలి.. ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2022-03-08T17:07:24+05:30 IST