Ramakrishna: అలాంటి వారిని రక్షించడమే జగన్ ప్రభుత్వ ధ్యేయమా?..
ABN , First Publish Date - 2022-08-14T17:23:03+05:30 IST
హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్ ప్రభుత్వ ధ్యేయమా?
అమరావతి (Amaravathi): హత్య చేసిన ఎమ్మెల్సీ (MLC)ని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ (MP)ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 90 రోజులలోపు ఛార్జ్ షీట్ వేయకుండా ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనక ఎవరున్నారన్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ పకీరప్ప ఎటువంటి విచారణ లేకుండా ఫేక్ వీడియో అంటూ తేల్చారని రామకృష్ణ మండిపడ్డారు. మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? అని ప్రశ్నించారు. అనంతబాబు కేసులో పోలీసు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.