విద్యుత్ కొనుగోళ్లపై సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి బహిరంగ చర్చకు రావాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-04-22T21:22:14+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

విద్యుత్ కొనుగోళ్లపై సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి బహిరంగ చర్చకు రావాలి: రామకృష్ణ

అనంతపురం: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదానీ ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి.. సీఎం జగన్ ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. చార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 25న వామపక్ష పార్టీలతో ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించారు. విజయవాడ ఘటనకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సీఎం బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పి.. దోషులను కఠినంగా శిక్షించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-22T21:22:14+05:30 IST