వైసీపీని జగన్ వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారు: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-04-29T21:23:27+05:30 IST
వైసీపీని సీఎం జగన్ వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.
విజయవాడ: వైసీపీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ ఆదానీ భార్య ప్రీతి ఆదానీకి.. వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఖాయం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికే వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును.. ఆదానీ కంపెనీకి జగన్ సర్కార్ అప్పనంగా అప్పగించిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సన్నిహితులుగా ఉన్న ఆదానీ, అంబానీలకు.. సీఎం జగన్ మోకరిల్లడం తగదని రామకృష్ణ హితవుపలికారు.