ఏపీ అస్తవ్యస్త విభజనకు కారణం బీజేపీనే: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-02-09T19:29:26+05:30 IST

బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఏపీ అస్తవ్యస్త విభజనకు కారణం బీజేపీనే: రామకృష్ణ

విజయవాడ: బీజేపీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మద్దతు తెలిపిందని, ఏపీ అస్తవ్యస్త విభజనకు కారణం బీజేపీయేనని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్, బీజేపీనే కారణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమాలను ముందుండి నడిపిస్తామన్నారు.


ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని రామకృష్ణ అన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను ఇవ్వడానికి ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 43 శాతం ఫిట్మెంట్ తీసుకున్నవారికి 23 శాతం ఫిట్మెంట్ ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ప్రశ్నించే వారిపై జగన్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. గురువారం వామపక్ష పార్టీలతో సమావేశం అయ్యాక... ఉద్యోగ ఉపాధ్యాయుల ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-02-09T19:29:26+05:30 IST