పాత పెన్షన్ స్కీంకు పెద్ద పబ్లిసిటీ: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2022-01-02T19:48:05+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

పాత పెన్షన్ స్కీంకు పెద్ద పబ్లిసిటీ: సీపీఐ రామకృష్ణ

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాత పెన్షన్ పథకానికి రూ. 250 పెంచి అదేదో కొత్త స్కీం అయినట్లుగా శనివారం ప్రారంభోత్సవం చేసి పెద్ద పబ్లిసిటీ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పేదల ఇళ్లకు రూ.10వేల కోట్లు కేటాయించినట్టు చెప్పిందని, అయినా ఇంతవరకు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. ఈ రూ.పదివేల కోట్లలో ఎమ్మెల్యేలు, అధికారులు రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పేదలకు ఇచ్చిన ఇళ్లతో ఎంతో ఆనందంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం పేదవాడిని ఇంకా పేదవాడిగా మారుస్తోందన్నారు. ఈ నెల 10న చలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కి పిలుపునిచ్చామని, రైతులు, రైతు కూలీలు కార్మిక సంఘాల కార్మికులను కలుపుకుని ముట్టడిస్తామని రామకృష్ణ చెప్పారు.

Updated Date - 2022-01-02T19:48:05+05:30 IST