రమణారెడ్డికి జాతీయస్థాయి విద్యాసేవా పురస్కారం
ABN , First Publish Date - 2021-07-27T05:17:00+05:30 IST
విశ్రాంత రసాయన విభాగాధిపతి, ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ జాతీయస్థాయి విద్యాసేవా పురస్కా రం అందుకున్నారు.
పులివెందుల రూరల్, జూలై 26: విశ్రాంత రసాయన విభాగాధిపతి, ప్రొఫెసర్ కేవీ రమణారెడ్డి డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ జాతీయస్థాయి విద్యాసేవా పురస్కా రం అందుకున్నారు. హైదరాబాద్కు చెందిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈనెల 25వ తేదీ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ వారు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అమల్రాజ్ తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా కళాశాలలో విద్యాభోదనలో కృషి, పరిశోధనా వ్యాసాలు, వివిధ హోదాలలో చేస్తున్న సేవల కృషికి ఫలితంగా ఈ జాతీయ పురస్కారం దక్కి ందని ప్రిన్సిపల్తో పాటు యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బం ది హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ చంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ గోపీనాథ్రెడ్డి, జాతీయ వినియోగదారుల మండలి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వివిధ అకాడమీల ప్రతినిధులు పాల్గొన్నారు.