రమణారెడ్డికి జాతీయస్థాయి విద్యాసేవా పురస్కారం

ABN , First Publish Date - 2021-07-27T05:17:00+05:30 IST

విశ్రాంత రసాయన విభాగాధిపతి, ప్రొఫెసర్‌ కేవీ రమణారెడ్డి డాక్టర్‌ సర్వేపల్లె రాధాకృష్ణన్‌ జాతీయస్థాయి విద్యాసేవా పురస్కా రం అందుకున్నారు.

రమణారెడ్డికి జాతీయస్థాయి విద్యాసేవా పురస్కారం
డాక్టర్‌ సర్వేపల్లె రాధాకృష్ణన్‌ జాతీయస్థాయి విద్యాసేవా పురస్కారం అందుకుంటున్న రమణారెడ్డి

పులివెందుల రూరల్‌, జూలై 26: విశ్రాంత రసాయన విభాగాధిపతి, ప్రొఫెసర్‌ కేవీ రమణారెడ్డి డాక్టర్‌ సర్వేపల్లె రాధాకృష్ణన్‌ జాతీయస్థాయి విద్యాసేవా పురస్కా రం అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈనెల 25వ తేదీ ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంస్థ వారు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు  పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ అమల్‌రాజ్‌ తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా కళాశాలలో విద్యాభోదనలో కృషి, పరిశోధనా వ్యాసాలు, వివిధ హోదాలలో చేస్తున్న సేవల కృషికి ఫలితంగా ఈ జాతీయ పురస్కారం దక్కి ందని ప్రిన్సిపల్‌తో పాటు యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బం ది హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ చంద్రయ్య, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ప్రొటెక్షన్‌ కమిటీ మెంబర్‌ గోపీనాథ్‌రెడ్డి, జాతీయ వినియోగదారుల మండలి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వివిధ అకాడమీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:17:00+05:30 IST