రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలి

ABN , First Publish Date - 2022-01-24T04:36:14+05:30 IST

మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరాంనగర్‌ దివ్యక్షేత్రంలో

రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలి
ఎంపీ, ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న చినజీయర్‌స్వామి

  • ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రిక అందజేసిన చిన జీయర్‌స్వామి 


శంషాబాద్‌రూరల్‌, జనవరి 23: మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరాంనగర్‌ దివ్యక్షేత్రంలో జరిగే శ్రీ రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలకు రావాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి ఆదివారం చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు ఆశ్రమంలో ఆహ్వాన పత్రికలు అందజేశారు. అంతకుముందు వారికి మంగళ శాసనములు అందజేశారు. స్వామీజీ ఆహ్వానం మేరకు తప్పకుండా ఉత్సవాలకు హాజరవుతామని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. 



Updated Date - 2022-01-24T04:36:14+05:30 IST