జెన్కో నూతన సీఈగా రామసుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-06-17T04:59:30+05:30 IST
శ్రీశైలం రెండోవ భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈగా రామసుబ్బా రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్వీకేస్ యూనియన్ ఉద్యోగులు కలిసి సన్మానించారు.
దోమలపెంట, జూన్ 16: శ్రీశైలం రెండోవ భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈగా రామసుబ్బా రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్వీకేస్ యూనియన్ ఉద్యోగులు కలిసి సన్మానించారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో రాఘవేంద్రరెడ్డి, శేఖర్, రాము, రామయోగయ్య, మల్లయ్య, అబ్దుల్లా, వెంకటయ్య, రమణారెడ్డి పాల్గొన్నారు.