పీకే ఆ విషయంలో టీఆర్ఎస్ని ఒప్పిస్తున్నాడు: రాంచందర్రావు
ABN , First Publish Date - 2022-04-27T00:24:20+05:30 IST
కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే..ఈ రెండు పార్టీలు కలసి మునగబోతున్నాయని బీజేపీ నేత రాంచందర్రావు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే..ఈ రెండు పార్టీలు కలసి మునగబోతున్నాయని బీజేపీ నేత రాంచందర్రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీఆర్ఎస్కి ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్కే అప్పగించింది. టీఆర్ఎస్ను పొత్తుపై ఒప్పించే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు. కాంగ్రెస్తో కలవబోతే బీజేపీ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ను పీకే ఒప్పిస్తున్నాడు. పోస్ట్ ఎలక్షన్స్ ఆ..? ఫ్రీ ఎలక్షన్స్ ఆ అన్నది తెలియదు కానీ.. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలవడం ఖాయమని జోస్యం చెప్పారు.ఐప్యాక్ కాంగ్రెస్కు పనిచేస్తుంది టీఆర్ఎస్కు పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు ఐప్యాక్ పనిచేస్తుంది.మమతా బెనర్జీ, జగన్మోహన్రెడ్డి, ములాయం సింగ్ వీళ్లంతా ప్రశాంత్ కిషోర్ క్లైంట్స్. దమ్ముంటే కాంగ్రెస్ వాళ్లను చెప్పమనండి ప్రశాంత్ కిషోర్ మాకైనా సలహాదారుగా ఉండాలి లేదా టీఆర్ఎస్కు అయినా సలహాదారునిగా ఉండమని చెప్పండి. వారికి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే వారు ఇద్దరు ఒక్కటే’’ అని రాంచందర్రావు అన్నారు.