నిరుపేదలకు కల్యాణలక్ష్మీ వరం
ABN , First Publish Date - 2021-05-10T05:53:35+05:30 IST
నిరుపేదలకు కల్యాణలక్ష్మీ వరం
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
మామునూరు, మే 9 : నిరుపేద కుటుంబాల అడపడుచులకు కల్యాణలక్ష్మీ ఓ వరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్థిదారులకు ఆదివారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగలకు దుస్తులు, షాదీముభారక్ వంటి ఽపథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీ ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మీతో అడపడుచులకు అండగా నిలిచినట్లు చెప్పారు. అనారోగ్యంతో చిక్సిత్స చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి అం దించి, కాపాడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీమాబారక్ల కింద 16 మంది లబ్ధిదారులకు రూ.16,01,856 చెక్కులను అందజేశారు. నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.లక్షా 72వేల విలువగల చెక్కులను అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణవిక్టర్, అంబాల ఉదయ్కిరణ్, వెంకట్రెడ్డి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.