Rammohan Naidu : యువత ఓట్లతో సీఎం కుర్చీపై కూర్చున్న దొంగ జగన్
ABN , First Publish Date - 2022-09-05T18:40:28+05:30 IST
వైసీపీ ప్రభత్వం(YCP Government) యువతను నమ్మించి మోసం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) పేర్కొన్నారు.
శ్రీకాకుళం : వైసీపీ ప్రభత్వం(YCP Government) యువతను నమ్మించి మోసం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP Rammohan Naidu) పేర్కొన్నారు. యువత ఓట్లతో సీఎం కుర్చీపై కూర్చున్న దొంగ జగన్ అని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ(Volunteer system)ను రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడని.. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా అంశాన్నే మరిచిపోయారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.