RamReddy Damodar reddy: మునుగోడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కోమటిరెడ్డి పాల్గొంటారు
ABN , First Publish Date - 2022-08-13T19:49:23+05:30 IST
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పని సరిగా మునుగోడు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటారని మాజీ మంత్రి, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు.
యాదాద్రి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy) తప్పని సరిగా మునుగోడు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటారని మాజీ మంత్రి, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy damodar reddy) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ను బహిష్కరించే విషయంలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. కష్టపడి గెలిపిస్తే పార్టీ మారారని రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు, ప్రజలు కసితో ఉన్నారని.... పోస్టర్లు అంటించింది కాంగ్రెస్ నాయకుల పని కాదని స్పష్టం చేశారు. 16 నుంచి మునుగోడు నియోజకవర్గంలో వరుస కార్యక్రమాల్లో ఎన్నికల కమిటీ నాయకులంతా పాల్గొంటారని తెలిపారు. మునుగోడు మనది.... కాంగ్రెస్ పార్టీ మనది అనే నినాదంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోందని రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.