సంతోష్ అండదండలతో పెరిగిన గ్రానైట్ మాఫియా అరాచకాలు: రమ్యరావు

ABN , First Publish Date - 2022-04-18T22:07:56+05:30 IST

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌రావు అండదండలతో గ్రానైట్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు అన్నారు.

సంతోష్ అండదండలతో పెరిగిన గ్రానైట్ మాఫియా అరాచకాలు: రమ్యరావు

హైదరాబాద్: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌రావు అండదండలతో గ్రానైట్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సంతోష్ ఒకప్పుడు మిడ్ మానేరు ముంపు కింద ప్రభుత్వం నుంచి 242 గజాల స్థలం పొందారన్నారు. ఆ స్థాయి నుంచి నేడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. సంతోష్ కోకాపేటలో 200 ఎకరాల స్థలం కొన్నారని, గ్రానైట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని  కులదోస్తాం అన్న విధంగా గ్రానైట్ మాఫియా మారిందన్నారు.చెరువులను సైతం గ్రానైట్ మాఫియా వదిలిపెట్టడం లేదన్నారు.ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతూ.. చెరువులను కబ్జా చేస్తున్న క్వారీల లైసెన్సు లు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన భూమిని కూడా కబ్జా చేసింది గ్రానైట్ మాఫియా అని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని రమ్యరావు ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-04-18T22:07:56+05:30 IST