Rangareddy: ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-30T14:51:40+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Rangareddy: ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Updated Date - 2022-05-30T14:51:40+05:30 IST