Rangareddy: జనంపైకి దూసుకెళ్లిన పాల వ్యాన్... ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-06-14T17:52:28+05:30 IST
జిల్లాలోని వనస్థలిపురం సుష్మ థియేటర్ సిగ్నల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రంగారెడ్డి: జిల్లాలోని వనస్థలిపురం సుష్మ థియేటర్ సిగ్నల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ పాల వ్యాన్ అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లి... ఆపై ఓ దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.